HNK: జిల్లా కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో వరంగల్ జిల్లా వ్యాప్తంగా 10 బెంచీలను ఏర్పాటు చేసినట్లు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తులు వి.బి. నిర్మలా గీతాంబ, పట్టాభి రామారావు తెలిపారు. మొత్తం 7,086 పెండింగ్ కేసులు వచ్చాయన్నారు. హనుమకొండ జిల్లా వ్యాప్తంగా 8 బెంచీలను ఏర్పాటు చేసి, మొత్తం 13,145 పెండింగ్ కేసులను పరిష్కరించినట్లు పేర్కొన్నారు.