ASR: వాహనదారులు రహదారి నిబంధనలు పాటించాలని కొయ్యూరు ఎస్సై పీ.కిషోర్ వర్మ సూచించారు. శనివారం సిబ్బందితో కలిసి కాకరపాడులో ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ప్రతీ వాహనాన్ని నిలిపి వేసి క్షుణ్ణంగా తనిఖీ చేపట్టారు. ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్, ఇతర రికార్డులను సక్రమంగా కలిగి ఉండాలన్నారు.