KMR: నాగిరెడ్డిపేట మండలం వాడికి చెందిన బాల్లింగం శుక్రవారం పాముకాటుతో మృతి చెందినట్లు ఎస్సై మల్లారెడ్డి తెలిపారు. గ్రామానికి చెందిన బాల్లింగం గురువారం రాత్రి భోజనం చేసిన తరువాత ఇంట్లో నిద్రించాడు. శుక్రవారం తెల్లవారుజామున ఆయనకు పాము కాటు వేయగా కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలిస్తుండగా మరణించాడు.