VZM: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శనివారం ఉదయం 10 నుంచి విజయనగరం పార్లమెంట్ పరిధిలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 నుంచి లావేరు హెడ్క్వార్టర్ కల్యాణమండపం నందు ఆయన అధ్యక్షతన తెలుగు దేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం, టీడీపీ మండల కమిటీ ఏర్పాటు కార్యక్రమంలో పాల్గొననున్నారని ఎంపీ కార్యాలయ వర్గాలు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపాయి.