AP: టీడీపీ ముఖ్యనేతలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈనెల 23 నుంచి ప్రజల్లోకి వెళ్లాలని నేతలకు సీఎం పిలుపునిచ్చారు. సూపర్-6 హామీలు దాదాపు అమలు చేశామనేది బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అమలు చేసిన ప్రతి హామీ ప్రజలకు వివరించాలని దిశానిర్దేశం చేశారు.