SKLM: ప్రభుత్వ ఆధీనంలో నిర్వహించబడుతున్న అంగన్వాడి కేంద్రాలు మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే కూన రవికుమార్ తెలిపారు. శనివారం ఆమదాలవలస జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఉన్న అంగన్వాడి కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా చిన్నారులతో కాసేపు ముచ్చటించారు. వారికి అందిస్తున్న పౌష్టికాహారల గురించి అడిగి తెలుసుకున్నారు.