WGL: నర్సంపేట బార్ అసోసియేషన్ సభ్యులు శనివారం వరంగల్ పోర్ట్ పోలియో జడ్జ్ మోసమి భట్టాచార్య, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. నర్సంపేట కోర్టులో జూనియర్ సివిల్ జడ్జిని నియమించాలని కోరుతూ వారికి వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో న్యాయవాదులు అంబటి శ్రీనివాస్, కొమ్ము రమేష్, పుట్టపాక రవి, తదితరులు ఉన్నారు.