NLR: నెల్లూరు సిటీ వైసీపీ అధ్యక్షుడిగా బొబ్బల శ్రీనివాస్ యాదవ్ను నియమించారు. మాజీ సీఎం జగన్ ఆదేశాల మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు ఈ పదవిలో సన్నపరెడ్డి పెంచల్ రెడ్డి కొనసాగారు. ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత వైసీపీ బలోపేతమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.