మంచు విష్ణు హీరోగా భారీ బడ్జెట్తో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘కన్నప్ప’. ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తొలుత మూవీ ట్రైలర్ను జూన్ 13న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కాగా, అహ్మదాబాద్ విమాన ఘటనతో వాయిదా వేశారు. అయితే, తాజాగా ఇవాళ సాయంత్రం 6 గంటలకు ట్రైలర్ విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ విషయాన్ని మంచు విష్ణు ‘X’ వేదికగా ప్రకటించాడు.