ATP: మెప్మా ఆధ్వర్యంలో రాపిడో ఈ బైక్లను ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, కలెక్టర్ వినోద్ కుమార్ శనివారం ప్రారంభించారు. దేశంలో మొట్టమొదటి సారిగా మహిళా సంఘాల సభ్యులకు రాపిడో ఈ-బైక్లను వారు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అనంతపురంలో 250 రాపిడో ఈ-బైక్లు మంజూరైనట్లు పేర్కొన్నారు. తొలి విడుతగా 20 బైక్లు పంపిణీ చేశామన్నారు.