ELR: యోగా చేయటం ద్వారా సంపూర్ణ ఆరోగ్యమని జిల్లా పంచాయతీ అధికారి అనురాధ అన్నారు. శనివారం ఉంగుటూరు గ్రామ కమ్యూనిటీ హాల్లో యోగా ట్రయల్ రన్ కార్యక్రమం జరిగింది. సర్పంచ్ బండారు సింధు మధుబాబు, ఎంపీపీ గంటా శ్రీలక్ష్మి, ఎంపీడీఓ రాజ్ మనోజ్ కుమార్, మండల పరిషత్ సూపరింటెండెంట్ ఆంజనేయబాబు, డీపీఆర్సీ టీం, పంచాయతీ కార్యదర్శి రవికుమార్ పాల్గొన్నారు.