TPT: ఉమ్మడి చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 15న అండర్-14, 16 బాలుర క్రికెట్ జట్ల ఎంపిక నిర్వహిస్తారని సీడీసీఏ అధ్యక్షుడు విజయకుమార్ తెలిపారు. వాల్మీకిపురం, తిరుపతి, చిత్తూరు జోన్లలో ఉదయం 9 గంటలకు అండర్-14, మధ్యాహ్నం 2 గంటలకు అండర్-16 విభాగంలో ఎంపికలు జరుగుతాయని పేర్కొన్నారు.