HNK: ధర్మసాగర్ మండలం ఎల్కతుర్తి క్రాస్ రోడ్ వద్ద జాతీయ రహదారిపై శనివారం టిప్పర్ బోల్తా పడి ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో డ్రైవర్ మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.