WG: కాళ్ల మండలం పెదఅమిరంలోని రాధాకృష్ణ కన్వెన్షన్ హాల్లో శనివారం ఉదయం 6గంటలకు ‘యోగా సామూహిక ప్రదర్శన’ నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ జి.స్వాతి శుక్రవారం తెలిపారు. యోగాపై ప్రజలందరికీ అవగాహన కల్పించేందుకు సుమారు 500 మందితో నిర్వహించే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగరాణి, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, జాయింట్ కలెక్టర్ రాహుల్ పాల్గొంటారన్నారు.