VZM: పోస్ట్ ఆఫీసులో సరికొత్త సంస్కరణలతో ఐటీ 2.0 రూపొందించడం జరిగిందని విజయనగరం డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ (DPS) కె. శ్రీనివాసు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం గంట్యాడలోని KPN BED కాలేజీలో గంట్యాడ, పెదమజ్జిపాలెం, గజపతినగరం, బొండపల్లి సబ్ పోస్ట్ ఆఫీసుల సిబ్బందితో సమావేశం నిర్వహించి ఈ నెల 18, 19 తేదీలలో జరగనున్న ఇన్సూరెన్స్ మేళాను విజయవంతం చేయాలని కోరారు.