SRD: బస్సు పాస్ చార్జీల పెంపకం నిరసనగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని కొత్త బస్టాండ్ ముందు శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు. జిల్లా కార్యదర్శి రాజేష్ మాట్లాడుతూ బస్ పాస్ చార్జీల పెంపు వల్ల పేద మధ్యతరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడతారని చెప్పారు. చార్జీలు తగ్గించకుంటే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.