చిత్తూరులో గురువారం దారుణం చోటు చేసుకుంది. నగరంలోని 47వ డివిజన్లో వెంకట రెడ్డి(50)ని ఆయన కుమారుడే హత్య చేసినట్లు స్థానికులు ఆరోపించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.