NZB: జులై 9న కేంద్ర కార్మిక సంఘాలు నిర్వహిస్తున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఆశా యూనియన్ జిల్లా ఉపాధ్యక్షురాలు స్వప్న పిలుపునిచ్చారు. గురువారం వర్నిలో ఆశా కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఆశా కార్యకర్తలకు ఉద్యోగ భద్రత కల్పించి, కనీస వేతనం రూ. 26 వేలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక చట్టాలను బలోపేతం చేయాలన్నారు.