మహబూబబాద్: జూలై 5, 6 తేదీల్లో కురవి మండల కేంద్రంలో జరిగే సీపీఐ జిల్లా 3వ మహాసభల లోగోను సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి నల్లు సుధాకర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ కార్యక్రమాలను విస్తరింప చేయడానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి ఇలాంటి మహా సభలు ఎంతగానో తోడ్పడతాయని అన్నారు.