NDL: ఆత్మకూరు పట్టణంలో పిచ్చి కుక్కల బెడదను అరికట్టాలని సీపీఎం పట్టణ కార్యదర్శి ఏ.రణదీర్ అధికారులను డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక సీపీఎం కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. తోటగేరి, పెద్ద పీర్లవీధి, తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన దాదాపు 20 మందిపై పిచ్చి కుక్కలు దాడిచేసాయని వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కోరారు.