కృష్ణా: కూటమి ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. శుక్రవారం అవనిగడ్డ ప్రభుత్వ హైస్కూలులో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫామ్ పంపిణీ చేశారు. నియోజకవర్గ ప్రత్యేక అధికారి పెనుమూడి సాయిబాబు, ఎంపీపీ సుమతి, ఎంఈవో పిచ్చియ్య, ఎంఐఎస్ కో-ఆర్డినేటర్ దివి శ్రీను, హెచ్ఎం శైలజ పాల్గొన్నారు.