అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై విదేశాంగశాఖ అధికారిక ప్రకటన చేసింది. విమాన ప్రమాదంలో చాలామంది మరణించినట్లు వెల్లడించింది. అయితే, మృతుల సంఖ్య ఇప్పడే చెప్పలేమని తెలిపింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి పేర్కొంది. కాగా, విమాన ప్రమాద సమయంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు.