KMR: రాజంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం జిల్లా ప్రోగ్రాం అధికారి డా.శిరీష సందర్శించారు. రక్తపోటు, మధుమేహం వ్యాధిగ్రస్థులకు అందిస్తున్న వైద్య సేవల వివరాలను మెడికల్ ఆఫీసర్ డా.విజయలక్ష్మిని అడిగి తెలుసుకున్నారు. NCD సేవలను పీహెచ్సీ పరిధిలోని గ్రామాల్లో విస్తరించాలన్నారు. ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కలగకుండా చూడాలని సిబ్బందికి సూచించారు.