కామారెడ్డి: బాన్సువాడ పట్టణ కేంద్రంలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిపై ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మున్సిపల్ అధికారులు, పట్టణ వార్డు ఇంఛార్జీలు, ఇందిరమ్మ కమిటీ సభ్యులతో ఆగ్రో ఇండస్ట్రీస్ నిర్వహించిన ఈ సమావేశంలో అధికారులకు పోచారం ఫోన్లో సూచనలు చేశారు.