W.G: జిల్లా వ్యాప్తంగా గురువారం మెగా డీఎస్సీ పరీక్ష మూడు కేంద్రాల్లో ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణ తెలిపారు. ఉదయం సెషన్కు 362 మంది అభ్యర్ధులకు గాను 348 మంది హాజరయ్యారని, మధ్యాహ్నం సెషన్లో 727 మందికి గాను 696 మంది హాజరయ్యారని ఆయన పేర్కొన్నారు. పరీక్ష సందర్భంగా ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని డీఈవో స్పష్టం చేశారు.