ATP: రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మే 12 నుంచి 20 వరకు ఈ పరీక్షలు జరిగాయి. అనంతపురం జిల్లాలో 9,445 మంది పరీక్ష రాయగా.. 7,206 మంది పాసయ్యారు. 76.29 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫలితాలను విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు.