ELR: ఆగిరిపల్లి మండలం వట్టిగుడిపాడు గ్రామంలో గురువారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ అనూష మాట్లాడుతూ.. బాల కార్మిక వ్యవస్థ నిరోధక చట్టం ఆవశ్యకతను వివరించారు. కార్మికులు, నేటి విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు. ఇందులో కార్మిక శాఖ అధికారి శ్యాంబాబు, లాయర్ బసవరాజు రామకృష్ణ పాల్గొన్నారు.