SRCL: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. గురువారం చందుర్తి మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు పాఠశాల దుస్తులు, పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి విద్యార్థులకు మెరుగైన వసతులు అందించడమే లక్ష్యం అని పేర్కొన్నారు.