NTR: జిల్లా జాయింట్ కలెక్టరుగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఇలక్కియని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు శుక్రవారం విజయవాడలోని జేసీ కార్యాలయంలో కలిశారు. ఆమెకు పుష్పగుచ్చాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మైలవరం నియోజకవర్గ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రత్యేక చొరవ చూపాలని కోరారు.