ASR: జిల్లా ఏజెన్సీలో పండుతున్న పనసకు గిరాకీ ఏర్పడుతుంది. ఏజెన్సీ పనసలో పోషకాలు మెండుగా ఉండడంతో ఒడిస్సా రాష్ట్రంలో దీనికి గిరాకీ ఉంది. దీంతో సీజన్ ప్రారంభం అయినప్పటి నుంచి వ్యాపారులు వీటిని కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్నారు. మన్యం సంతల్లో పనసను రూ.100 నుంచి రూ.120కి గిరి రైతులు విక్రయిస్తున్నారు.