NDL: పలు జిల్లాల్లో ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసినట్లు జిల్లా పోలీసులు శనివారం తెలిపారు. మిర్యాలగూడ, గుంటూరు ప్రాంతాలకు చెందిన వేముల శివశంకర్, పవన్ కుమార్లను అదుపులోకి తీసుకొని, వారి నుంచి రూ.39 లక్షల విలువైన 394 గ్రాముల బంగారం, 326 గ్రాముల వెండి ఆభరణాలతో పాటు ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నామన్నారు.