ELR: ద్వారకాతిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు ముగియడంతో వేలాదిమంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. క్షేత్ర పరిసరాలు భక్తులతో కళకళలాడాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, దర్శనం క్యూ లైన్లు, అనివేటి మండపం, సెల్ ఫోన్లు భద్రపరిచే ప్రదేశం, కేశ ఖండనశాల తదితర విభాగాలు భక్తులతో కిటకిటలాడాయి.