NLR: టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తండ్రి మాజీ శాసనసభ్యులు పల్లా సింహాచలం ఇటీవల మరణించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్, కావలి టీడీపీ నేత మాలేపాటి సుబ్బానాయుడు శనివారం విశాఖపట్నం సీతంపేటలోని పల్లా శ్రీనివాసరావు నివాసానికి వెళ్లి పల్లా సింహాచలం చిత్రపటానికి నివాళులర్పించారు.