SRD: సిర్గాపూర్లో రెవెన్యూ సదస్సు శుక్రవారం జరగగా ఖేడ్ MLA సంజీవరెడ్డి సందర్శించి పరిశీలించారు. ఈ మేరకు తహశీల్దార్ హేమంత్ కుమార్తో మాట్లాడి రెవెన్యూ సమస్యల దరఖాస్తులపై అడిగి తెలుసుకున్నారు. గతంలో ధరణి పోర్టల్ వ్యవస్థతో రైతులు చాలా ఇబ్బందులు పడ్డారని MLA చెప్పారు. రెవెన్యూ సమస్యలు తొలగించేందుకు తమ ప్రభుత్వం భూభారతి కొత్త చట్టం తెచ్చిందన్నారు.