ASR: పిల్లలను సత్ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి అన్నారు. పెదమాకవరం మోదకొండమ్మ ఆలయాన్ని బుధవారం సందర్శించారు. ప్రతి మనిషిలోనూ సత్వతమో రజోగుణాలు ఉంటాయని, అందరూ సాత్విక గుణాన్ని అలవర్చుకోవాలన్నారు. గిరిజన విద్యార్థులు ఆహారపు అలవాట్లను నియంత్రించుకుంటే వేదాంగాలను సులువుగా అభ్యసించగలుగుతారన్నారు.