ASR: ఉపాధి హామీ పథకం అమలులో జిల్లా అగ్రస్థానంలో నిలిచిందని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. బుధవారం జూనియర్ కళాశాల మైదానంలో డ్వామా ఆధ్వర్యంలో సుపరిపాలన స్వర్ణాంధ్ర సమావేశం నిర్వహించారు. గతేడాది ఉపాధి శ్రామికులకు 65శాతం పనులు కల్పించామన్నారు. జిల్లాలో రూ.600కోట్ల ఉపాధి హామీ పనుల షెల్ప్ సిద్ధం చేశామన్నారు.