PLD: చిలకలూరిపేటలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు బుధవారం పీ-4 కార్యక్రమంలో పేద విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు. ఒయాసిస్ వెల్ఫేర్ నిర్వహించిన ఈ వేడుకలో పాల్గొన్న ఆయన, ధనవంతులు పీ-4లో పాలుపంచుకుని విద్యార్థులకు, పేదలకు సహాయం చేయాలన్నారు. రాష్ట్రాభివృద్ధికి ఇది తోడ్పడుతుందన్నారు. 21 మందికి రూ.5వేలు చొప్పున బహుమతులు అందించారు.