W.G: భీమవరం మండలానికి చెందిన నలుగురిపై బుధవారం బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సీఐ బలరాం రాజు తెలిపారు. మండలానికి చెందిన అనిల్ కుమార్, చిలుకూరి శ్రీను, సత్యనారాయణ, పుచ్చకాయల నారాయణను మండల మేజిస్ట్రేట్ వద్ద బైండోవర్ చేసినట్లు చెప్పారు. వీరు ఏడాది పాటు బైండోవర్ను ఉల్లంఘిస్తే రూ. లక్ష జరిమానా, కేసు నమోదు చేస్తామని సీఐ హెచ్చరించారు.