KRNL: మంత్రాలయం మఠంలో బుధవారం రాత్రి నవరత్న రథోత్సవం వైభవంగా జరిగింది. రాఘవేంద్రస్వామి బృందావనాన్ని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు మంత్రాలయం చేరుకున్నారు. మరోవైపు జయ దిగ్విజయ మూలరాములు పీఠాధిపతి సుబుదేంద్రతీర్థులు విశేష పూజలు నిర్వహించారు. ప్రహ్లాదరాయలకు వెండి ఊయలలో ఊంజల సేవ అనంతరం బంగారు, నవరత్న రథంపై ఊరేగించారు.