NDL: బనగానపల్లె మండల కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో బుధవారం నాడు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి ప్రజలు తరలివచ్చి తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి వినతి పత్రాలను అందజేశారు. మంత్రి బీసీ ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.