BPT: బాపట్ల మండలం చెరువు జమ్ములపాలెం గ్రామంలో గత వారం భార్యపై అనుమానంతో ఆమె నిద్రిస్తుండగా భర్త పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యాడు. బంధువులు హుటాహుటిన ఆమె వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. భార్యను హతమార్చిన ఘటనలో నిందితుడిని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడుని బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు మీడియా ముందు హాజరు పరిచారు.