భూపాలపల్లి: భూపాలపల్లిలో ఎంఎస్ఓ సంఘం నేతలు బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు వేషాల రమేష్ బాబు హాజరై మాట్లాడుతూ.. కేబుల్ ఆపరేటర్లపై టీఎస్ఎన్పీడీసీఎల్ విధించిన పోల్ టాక్స్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నష్టాల్లో నడుస్తున్న కేబుల్ పరిశ్రమకు ఇది అదనపు భారం అని తెలిపారు. ఆపరేటర్లు బోట్ల రాజు, సురేష్, సతీష్ తదితరులున్నారు.