పార్వతీపురం మన్యం జిల్లాలో పీఎం సూర్యఘర్ గ్రౌండింగ్ వేగవంతం కావాలని జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ ఏపీఈపీడీసీఎల్ ఏడీలను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమమైన సూర్యఘర్ పథకం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్నారు. ప్రతి రోజూ ప్రగతి ఉండాలని, ఇందుకు గ్రామ, మండల, వార్డు స్థాయిలో శిబిరాలను నిర్వహించేలా ప్రణాళికను సిద్ధం చేయాలని అన్నారు.