GDWL: జిల్లా గట్టు, కేటిదొడ్డి మండలాల్లో 80 మంది యువత సహాయంతో 57 వేసవి రేమిడియల్ సెంటర్లు నిర్వహించారు. 45 రోజులు సేవలందించిన యువతను MV ఫౌండేషన్ జాతీయ కన్వీనర్ ఆర్. వెంకట్ రెడ్డి అభినందించారు. విద్యాశాఖతో కలిసి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు నల్లా రెడ్డి, వెంకటేశ్వరరావు, విజయభాస్కర్, యుగంధర్, మదర్స్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.