SKLM: మహిళలను, రాజధాని నిర్మాణాలపై కించపరిచిన సాక్షి మీడియాపై ఆముదాలవలస పట్టణంలో మంగళవారం మహిళలు నిరసన వ్యక్తం చేసారు. గాంధీ విగ్రహం నుంచి పోలీస్ స్టేషన్ వరకు నినాదాలు చేస్తూ వెళ్లి పోలీసులకు వినతి పత్రం సమర్పించారు. అక్కడి నుంచి తహసిల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహిస్తూ డెప్యూటీ తాసిల్దార్కు వినతి పత్రం సమర్పించారు.