TG: రాష్ట్రంలో ఇంజినీరింగ్ విద్యార్థులకు శుభవార్త. ఆగస్టు 14 లోపు తరగతులను ప్రారంభిస్తామని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి తెలిపారు. జూలై మొదటి వారంలో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రారంభిస్తామని, ఆగస్టు 14లోపు ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని అన్నారు. రాష్ట్రంలో 4 విద్యాసంస్థలు అనుమతి లేకుండా నడుస్తున్నాయని, వాటిపై చర్యలు ఉంటాయని బాలకిష్టారెడ్డి పరోక్షంగా హెచ్చరించారు.