SKLM: కవిటి మండల కేంద్రంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఎస్సై రవివర్మ ఆధ్వర్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. గంజాయి అక్రమ రవాణా, నిల్వలపై నిఘా ఉంచామని ఎస్సై తెలిపారు. పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్, దుకాణాలు, ప్రజా రవాణా, రద్దీగా ఉండే ప్రదేశాల్లో డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా ఎవరైనా తిరిగితే సమాచారం ఇవ్వాలని తెలిపారు.