JGL: జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ బి. సత్యప్రసాద్ అదనపు కలెక్టర్, ఆర్డీవోలతో కలిసి ప్రజల నుంచి 62 ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు. అర్జీలపై సమగ్ర విచారణ జరిపి సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులు ఆదేశించారు. పెండింగ్ లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, తహశీల్దార్లు పాల్గొన్నారు.