MDK: రామాయంపేట మండలం పర్వతాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో దివ్యాంగుడికి ట్రై సైకిల్ పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన చింతల రాములు అనే దివ్యాంగుడు గత కొంతకాలంగా ట్రై సైకిల్ లేక ఇబ్బంది పడుతుండడంతో స్థానిక సర్పంచ్ తార్యా నాయక్ తన సొంత నిధులతో ట్రై సైకిల్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి లక్ష్మి, గ్రామపంచాయతీ పాలకవర్గం సభ్యులు పాల్గొన్నారు.