ADB: ఉట్నూర్లోని శ్రీ రామాలయంలో గత తొమ్మిది రోజులుగా కొనసాగుతున్న చండీ యాగం బుధవారంతో ముగిసింది. ముగింపు వేడుకల్లో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి యువరాజ్ మర్మాట్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. యాగ నిర్వాహకులు తీర్థ ప్రసాదాలు అందజేసి పీవోను సన్మానించారు. చండీ యాగంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.